Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ అభివృద్ధి కోసమే ప్రధానిని కలిశా : సీఎం నితీశ్ కుమార్

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం నా బాధ్యత. ఇపుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.

Webdunia
ఆదివారం, 28 మే 2017 (10:49 IST)
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం నా బాధ్యత. ఇపుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఇచ్చిన విందుక గైర్హాజరైన నితీశ్ కుమార్.. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు హాజరు కావడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశం బీజేపీ-జేడీయూ భవిష్యత్ రాజకీయాలకు సంకేతమని భావిస్తుండగా, అటువంటిదేమీ లేదని నితిశ్ కొట్టిపారేశారు. 
 
ప్రధానితో సమావేశం తర్వాత నితీశ్ స్పందిస్తూ... ప్రధాని - ముఖ్యమంత్రి సాధారణ భేటీ అని, దీనికేమంత ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. జేడీయూ చీఫ్‌గా తాను ప్రధానిని కలవలేదని, ఓ ముఖ్యమంత్రిగానే ఆయనను కలిశానని స్పష్టం చేశారు. దీనిని మీడియా అనవసరంగా పెద్దది చేసి చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
 
లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన సీఎం.. నిజాలు తెలిశాకే ఈ విషయంలో స్పందిస్తానన్నారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నౌత్ గౌరవార్థం ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు నితిశ్ కుమార్‌ను ఆహ్వానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments