Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేయలేం: యూపీలో బీజేపీ

యూపీలో విజయం కోసం బీజేపీ రామమందిర నిర్మాణం మాటెత్తింది. ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (15:59 IST)
యూపీలో విజయం కోసం బీజేపీ రామమందిర నిర్మాణం మాటెత్తింది. ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని లేవనెత్తింది.

యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ రామమందిర నిర్మాణాన్ని రెండు నెలల్లో నిర్మించలేమని.. ఎన్నికలు పూర్తయ్యాక రామమందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని యూపీ బీజేపీ చీఫ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తెలిపారు. 
 
రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని పేర్కొన్న మౌర్య, యూపీ సీఎం అఖిలేశ్‌ ఇటు దళితులను, అటు వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల జాబితాలో 17 ఓబీసీ కులాలను చేర్చేందుకు అఖిలేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో మౌర్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా యూపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రామమందిర నిర్మాణంపై గొంతెత్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments