Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కోడిగుడ్ల ధర రూ.1700.. బిల్లు చూసి కనిగుడ్లు తేలేసిన కస్టమర్

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:04 IST)
గతంలో రెండు అరటిపండ్లకు రూ.443 వసూలు చేసింది చంఢీగఢ్‌లోని మారియట్ హోటల్. అపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు హోటల్ యాజమాన్యానికి వాణిజ్య పన్నుల విభాగం రూ.25 వేల అపరాధం విధించి కూడా. జీఎస్టీ పరిధిలోకి రాని అరటి పండ్లకు కూడా జీఎస్టీ విధించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు ఎదురైంది. 
 
ఇపుడు అలాంటి సంఘటనే ప్రముఖ రచయిత కార్తీక్ దార్‌కు ఎదురైంది. ఈయన ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ రెండు బాయిల్డ్ ఎగ్‌లకు ఆర్డర్ ఇచ్చారు. వీటికి రూ.1700 చార్జి చేశారు. అలాగే, ఒక ఆమ్లేట్‌కు రూ.850 వసూలు చేశారు. అలాగే, రెండు ఎగ్ ఆమ్లేట్స్‌కు కూడా రూ.1700 బిల్లు వేశారు. ఈ బిల్లు చూసిన కార్తీక్ దార్‌కు కళ్లు బైర్లు కమ్మాయి. 
 
ఇక వెంటనే రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'నిరసన వ్యక్తం చేద్దామా భాయ్‌..!' అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. 'గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా' అని ఒకరు.. 'చికెన్‌ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా' అని మరొకరు కామెంట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments