Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కోడిగుడ్ల ధర రూ.1700.. బిల్లు చూసి కనిగుడ్లు తేలేసిన కస్టమర్

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:04 IST)
గతంలో రెండు అరటిపండ్లకు రూ.443 వసూలు చేసింది చంఢీగఢ్‌లోని మారియట్ హోటల్. అపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు హోటల్ యాజమాన్యానికి వాణిజ్య పన్నుల విభాగం రూ.25 వేల అపరాధం విధించి కూడా. జీఎస్టీ పరిధిలోకి రాని అరటి పండ్లకు కూడా జీఎస్టీ విధించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు ఎదురైంది. 
 
ఇపుడు అలాంటి సంఘటనే ప్రముఖ రచయిత కార్తీక్ దార్‌కు ఎదురైంది. ఈయన ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ రెండు బాయిల్డ్ ఎగ్‌లకు ఆర్డర్ ఇచ్చారు. వీటికి రూ.1700 చార్జి చేశారు. అలాగే, ఒక ఆమ్లేట్‌కు రూ.850 వసూలు చేశారు. అలాగే, రెండు ఎగ్ ఆమ్లేట్స్‌కు కూడా రూ.1700 బిల్లు వేశారు. ఈ బిల్లు చూసిన కార్తీక్ దార్‌కు కళ్లు బైర్లు కమ్మాయి. 
 
ఇక వెంటనే రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'నిరసన వ్యక్తం చేద్దామా భాయ్‌..!' అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. 'గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా' అని ఒకరు.. 'చికెన్‌ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా' అని మరొకరు కామెంట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments