Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాపై దృష్టిసారించిన కేజ్రీవాల్ - 14 నుంచి ఆప్ పాదయాత్రలు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:47 IST)
ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇపుడు తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అదే జోష్‌తో తెలంగాణాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. 
 
వచ్చే నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆప్ ఆధ్వర్యంలో తెలంగాణాలో పాదయాత్రలు ప్రారంభమవుతాయి. వీటిని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments