Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ దళితుడి ఇంటికి వెళ్ళిన యడ్యూరప్ప హోటల్ ఇడ్లీ తిన్నారా?

కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో యడ్యూరప్ప హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ తిన్నారని.. దుమారం రేగింది. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ నేతలు ఓ వీడియో సైతం విడుదల చేశారు. యడ్యూ

Webdunia
మంగళవారం, 23 మే 2017 (13:51 IST)
కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో యడ్యూరప్ప హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ తిన్నారని.. దుమారం రేగింది. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ నేతలు ఓ వీడియో సైతం విడుదల చేశారు. యడ్యూరప్ప అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. 
 
ఆ వీడియోలో యడ్యూరప్ప సందర్శించిన దళిత కుటుంబానికి చెందిన సభ్యుడొకరు మాట్లాడుతూ.. మే 19న యడ్యూరప్ప తమ ఇంటికి వచ్చి అల్పాహారం తీసుకున్నారు. ఇది తమకు చాలా ఆనందం కలిగించిందని.. అనుకున్నదాని కంటే ఎక్కువమంది రావడంతో తాము సిద్ధం చేసిన అల్పాహారం సరిపోలేదు. దీంతో వారికి సరిపడా అల్పాహారం వడ్డించేందుకు హోటల్‌కి వెళ్లి ఇడ్లీ తీసుకురావాల్సి వచ్చిందన్నాడు. 
 
యడ్యూరప్పకు తాము తయారు చేసిన అల్పాహారమే వడ్డించామని.. ఆయన తమ ఇంట్లో అల్పాహారం తీసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సదరు కుటుంబమే స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఏం తిన్నారో ఇంతకు మించిన సాక్ష్యం కావాలా?'' అని కర్ణాటక బీజేపీ నేత సురేష్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలే కావాలని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సురేష్ కుమార్ ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments