Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెబనాన్ ఘటన.. చెన్నై ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (20:27 IST)
లెబనాన్ ఘటన నేపథ్యంలో.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏళ్ల తరబడి సుమారు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని నిల్వ ఉంచడం ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బీరూట్‌ సంఘటన చోటుచేసుకున్న తరుణంలో చెన్నై పోర్టు స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. 
 
చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని.. అది కస్టమ్స్ శాఖ కంట్రోల్‌లో ఉందని చెప్పారు. బాణాసంచా, ఎరువుల తయారీలో వినియోగించే ఈ పేలుడు పదార్థాన్ని ఫైర్‌వర్క్‌ను.. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే శివకాశిలోని ఓ గ్రూపు కోసం ఉద్దేశించినదన్నారు. 2015లో ఈ అమోనియం నైట్రేట్‌ని చెన్నై పోర్టులో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 
 
మొత్తం 36 కంటెయినర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో కంటెయినర్ లో దాదాపు 20 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందన్నారు. దీన్ని శ్రీ అమ్మాన్ కెమికల్స్ అనే సంస్థ అక్రమంగా దిగుమతి చేసుకుందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తాము కోర్టుకెక్కామని.. గత ఏడాది నవంబరులోనే కోర్టు రూలింగ్ ఇచ్చిందన్నారు. త్వరలోనే వేలం వేస్తామని కస్టమ్స్ అధికారి వివరణ ఇచ్చారు. 
 
అసురక్షిత పద్దతిలో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రైట్‌ బీరూట్‌లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 135 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments