ప్రియుడి కోసం భర్తను సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించి చంపిన భార్య

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (15:22 IST)
కేరళలో నూనె వ్యాపారం చేసేవాడు శ్యామ్. సోఫియా అనే యువతిని ఇచ్చి ఆరేళ్ళ క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి కాకముందు నుంచి ఉన్న ప్రియుడిని వదులుకోలేక భర్తను అతి దారుణంగా చంపేసింది భార్య.
 
కేరళలో రెండు సంవత్సరాల పాటు ఉన్న ఈ ప్రేమ జంట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. సోఫియా ప్రియుడు అరుణ్ కూడా అక్కడే ఉండేవాడు. సోఫియాకు కొడుకు పుట్టిన తరువాత అరుణ్‌తో సోఫియా రెగ్యులర్‌గా కలుస్తూ ఉండేది. వీరి మధ్య సంవత్సరానికి పైగా వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది.
 
అయితే శ్యామ్ ఆస్ట్రేలియాలో బాగానే ఆస్తులు కూడబెట్టాడు. భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడని సోఫియా ఎలాగైనా అతన్ని చంపేయాలని ప్రియుడు అరుణ్‌‌తో కలిసి ప్లాన్ చేసింది. సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించింది. దీంతో శ్యామ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీనితో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు శ్యామ్‌కు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడు అరుణ్‌కు 25 యేళ్ళ జైలు, సోఫియాకు 22 యేళ్ళ జైలు శిక్ష విధించింది ఆస్ట్రేలియా కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments