అద్వానీ భవితవ్యం తేలేది 30న

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:21 IST)
బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరి భవితవ్యం ఈ నెల 30న తేలిపోనుంది. బాబ్రి మసీదు విధ్వంసం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆ రోజున తీర్పును వెలువరించనుంది.

బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరినీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. 1992 డిసెంబరు 6వ తేదీన అయోధ్యలో 16వ శతాబ్దానికి చెందిన మసీదును కరసేవకులు ధ్వంసం చేశారు.

బాబ్రి మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ప్రభృతులపై నేరపూరితమైన కుట్ర అభియోగాలను ప్రత్యేక సిబిఐ కోర్టు 2017లో నమోదు చేసింది.

అభియోగాలను తొలగిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, 2017లో అద్వానీ ప్రభృతులపై రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేరపూరితమైన కుట్ర అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.

అద్వానీ, ఇతరులపై అభియోగాలను తొలగించాలని 2001లో ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 2010లో అలహాబాద్‌ హైకోర్టు ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments