Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీ భవితవ్యం తేలేది 30న

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:21 IST)
బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరి భవితవ్యం ఈ నెల 30న తేలిపోనుంది. బాబ్రి మసీదు విధ్వంసం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆ రోజున తీర్పును వెలువరించనుంది.

బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరినీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. 1992 డిసెంబరు 6వ తేదీన అయోధ్యలో 16వ శతాబ్దానికి చెందిన మసీదును కరసేవకులు ధ్వంసం చేశారు.

బాబ్రి మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ప్రభృతులపై నేరపూరితమైన కుట్ర అభియోగాలను ప్రత్యేక సిబిఐ కోర్టు 2017లో నమోదు చేసింది.

అభియోగాలను తొలగిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, 2017లో అద్వానీ ప్రభృతులపై రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేరపూరితమైన కుట్ర అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.

అద్వానీ, ఇతరులపై అభియోగాలను తొలగించాలని 2001లో ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 2010లో అలహాబాద్‌ హైకోర్టు ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments