Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీ, రజినీకాంత్‌, అమితాబ్‌, పీవీ సింధులకు పద్మ అవార్డులు!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (12:21 IST)
కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ఇచ్చే పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ, సినీ సూపర్ స్టార్లు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌తో పాటు.. తెలుగు క్రీడాకారిణి పీవీ సింధులకు పద్మ పురస్కారాలు వరించాయి. సాధారణంగా ప్రతి యేడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ యేడాది మొత్తం 148 మందికి ఈ పురస్కారాలను కేంద్రం ఇవ్వనుంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి పద్మవిభూషణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పద్మ అవార్డులు వరించాయి. అలాగే, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. 
 
వీరితో పాటు.. ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, శ్రీశ్రీ రవిశంకర్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్, ఎన్. గోపాలస్వామి, పి.వి.సింధు, సర్దార్ సింగ్, ప్రఖ్యాత దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, స్క్రిప్ట్ రైటర్, గీత రచయిత సలీం ఖాన్, యాడ్ ఫిలిం మేకర్ ప్రసూన్ జోషి కూడా ఈ యేడాది పద్మ పురస్కారాలకు ఎంపికైనట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments