Webdunia - Bharat's app for daily news and videos

Install App

రండి బాబోయ్.. రండి... కర్ణాటకలో జోరుగా గుర్రాల బేరాలు : సినీ నటి రమ్య

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకావడంపై కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి రమ్య కామెంట్స్ చేశారు. రండి.. బాబోయ్.. రండి.. కర్ణాటకలో గుర్రాల బేరాలు జరుగుతున్నాయంట

Webdunia
గురువారం, 17 మే 2018 (10:25 IST)
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకావడంపై కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి రమ్య కామెంట్స్ చేశారు. రండి.. బాబోయ్.. రండి.. కర్ణాటకలో గుర్రాల బేరాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.
 
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె స్పందిస్తూ, గుర్రాల సంతలో బేరాలు. కర్ణాటకలోనూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బీజేపీ బిజీగా ఉందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు. గతంలో పీయుష్ గోయల్ మధ్యవర్తిగా గుజరాత్ ఎన్నికల్లో అనేకమంది ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. 
 
ఇదిలావుండగా, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లొంగబోరని కాంగ్రెస్ నేత, కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రలోభాలకు తెరలేపిన మాట వాస్తవమేనని, అయితే, తమ ఎమ్మెల్యేలు వాటికి లొంగరన్న విశ్వాసం తమకుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments