Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత డెత్ మిస్టరీ: రెండో లేఖ రాసిన గౌతమి.. మోడీ గారూ నిజం చెప్పండి..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలున్నాయి. ఆమె డెత్ మిస్టరీ వీడాలని.. నిజాలు మరణించకూడదంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖతో అన్నాడీఎంకే కార్యకర్తలు,

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (16:29 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలున్నాయి. ఆమె డెత్ మిస్టరీ వీడాలని.. నిజాలు మరణించకూడదంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖతో అన్నాడీఎంకే కార్యకర్తలు, నటుడు శరత్ కుమార్‌ల నుంచి బెదిరింపులు, విమర్శలు ఎదుర్కొన్నారు. గౌతమి అమ్ముడుపోయారని ఇలాంటి లేఖలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నటి రాధిక భర్త, నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు, ఏడీఎంకే నేత శరత్ కుమార్ విమర్శలు గుప్పించారు. 
 
ఈ నేపథ్యంలో గౌతమి తొలి లేఖకు ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రెండోసారిగా రిమైండింగ్ లెటర్‌ను గౌతమి రాశారు. అందులో జయలలితకు అందించిన చికిత్సలు, ఆమె మృతి పట్ల గల అనుమానాలు ప్రజలకు తెలియాలన్నారు. 75 రోజుల పాటు అమ్మకు ఇచ్చిన చికిత్స పట్ల అపోలో ఇచ్చిన వివరాలను స్వాగతిస్తున్నా. అయితే తొలి లేఖలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
 
తాను రాసిన లేఖకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి తాను సైతం ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గౌతమి ఇటీవల మోడీకి లేఖ రాయడంతో ఆమెపై అన్నాడీఎంకే నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తన భావాలను సమర్థించుకుంటూ  గౌతమి మరో లేఖను ప్రధానికి రాశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments