ఆర్థిక లావాదేవీల కారణంగా ఒక మహిళ యాసిడ్చే దాడికి గురైంది. యూపీలోని బరేలి జిల్లా ఫరీద్పూర్లో ఈ ఘోరం జరిగింది. పరా ప్రాంతంలో కార్పొరేటర్ ముస్కాన్ దేవి(35), ఆమె భర్త సోను కలిసి వారి ఇంటి వద్దే దుకాణం నడుపుతున్నారు.
రామ్దాస్, అరవింద్ అనే వ్యక్తులతో వీరికి డబ్బు విషయంలో తగాదా రావడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ ఇద్దరు వ్యక్తులు కార్పొరేటర్పై యాసిడ్ పోశారు. దీంతో ఆమె ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.