Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఫియా డాన్‌తో వేదిక పంచుకున్న అమిత్ షా.. కొత్త వివాదం!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (17:01 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం హర్యానాలో మాఫియా డాన్‌తో వేదికను పంచుకుని కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. నితిశ్ కటారా, జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడిగా తేలిన వికాస్ యాదవ్ తండ్రి, మాఫియా డాన్ డీపీ యాదవ్‌తో కలిసి హర్యానాలో ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీపీ యాదవ్‌కు ముందు ముందు మంచి రోజులున్నాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై నితిశ్ కటారా తల్లి నీలం కటారా ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. 
 
‘డీపీ యాదవ్‌కు మంచి రోజులుంటే, మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆమె అమిత్ షాను నిలదీశారు. 2004లోనూ డీపీ యాదవ్‌కు బీజేపీ సభ్యత్వమిచ్చింది. అయితే, నితిశ్ కటారా హత్యోదంతం నేపథ్యంలో ఆరోపణల వెల్లువ కారణంగా నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments