Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుషి హత్య కేసు : తల్వార్ దంపతులు విడుదల

కన్నబిడ్డ ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చిన తల్వార్ దంపతులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో రాజేష్, నూపుర్ తల్వార్‌ దంపతులు గత 2013 నుంచి దాస్నా జైలుల

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (05:47 IST)
కన్నబిడ్డ ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చిన తల్వార్ దంపతులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో రాజేష్, నూపుర్ తల్వార్‌ దంపతులు గత 2013 నుంచి దాస్నా జైలులోనే గడుపుతూ వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. 
 
ఈ సందర్భంగా జైలు వెలుపల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు తమ లగేజీతో సహా నడుచుకుంటూ బయటకు వచ్చారు. వారిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, మీడియా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని కారులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
 
ఆరుషి హత్య కేసులో నూపూర్, రాజేష్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈనెల 12న సంచలన తీర్పునిచ్చింది. వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిన అధికారులు.. సోమవారం సాయంత్రం వారిని జైలు నుంచి విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments