Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు: కపిల్ మిశ్రా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2

Webdunia
ఆదివారం, 14 మే 2017 (13:45 IST)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్ల లంచం తీసుకోవడాన్ని తాను కళ్ళారా చూశానని ఆరోపించిన మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
 
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మిశ్రా చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మిశ్రా మాట్లాడుతూ.. యాక్సిస్ బ్యాంక్ ద్వారా కేజ్రీవాల్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు లెక్కలు సమర్పించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను చూపారు. ఆప్ నేతలకు అడ్డదారుల్లో విరాళాలు అందాయన్నారు.
 
16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ఖాతాల్లోకి డబ్బులు చేరాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కపిల్ మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహచరులు ఆయన హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్త ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తే ఆప్ నేతల అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లను తానే సీబీఐకి అందజేస్తానని మిశ్రా భార్య ప్రీతి మిశ్రా తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments