Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరు చేసేస్తారేమోనని.. ప్రేయసికి తాళి కట్టేశాడు..!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (12:53 IST)
తన ప్రేయసిని వేరు చేసేస్తారనే భయంతో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి రోడ్డు పైనే తాళి  కట్టేశాడు. ఈ తతంగం తమిళనాడు రాష్ట్రంలోని తంజావురులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అనే ఇద్దరు యువతీ యువకులు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. 
 
వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియరావడంతో ఆమెను వారు మందలించారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాట వినకుండా ఆనంద్‌ను తరచూ కలుసుకునేది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి పంపించారు.
 
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వెళ్లాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆనంద్.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను వెంట తీసుకుని బస్టాండుకు బయల్దేరాడు. దీంతో దివ్యను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఎక్కడ దూరం చేసేస్తారనే భయంతోనే ఆనంద్ రోడ్డుపైనే తాళికట్టేశాడు. పోలీసులకు దివ్య బంధువులు ఫిర్యాదు చేసినా మేజర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments