Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లాడింది... కానీ అతడి నుంచి దాన్ని తట్టుకోలేక విడాకులు కోరింది...

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (15:56 IST)
ప్రేమించేటపుడు ఆమెకి అంతగా దాని గురించి తెలయలేదు. కానీ పెళ్లయ్యాక బాగా తెలిసింది. ఎందుకంటే రాత్రివేళ పడకగదికి చేరాక ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయేది. కారణం... అతడి శరీరం నుంచి వచ్చే దుర్వాసన... అదేనండీ చెమట వాసన. దాన్ని భరించలేక అతడి నుంచి విడాకులు కోరింది ఓ యువతి. 
 
అసలు విషయానికి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన యువతి సింధీ వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకున్న తర్వాత అతడి ప్రవర్తన చూసి షాక్ తిన్నది. ఆమె అలవాట్లకు ఇతడి అలవాట్లకు పొంతన లేకుండా పోయింది. దాంతో చాలాసార్లు ఇద్దరి మధ్య వాగ్వాదాలు చెలరేగేవి.
 
ఇవన్నీ ఇలావుంటే కట్టుకున్న భర్త ఉద్యోగం బిజీ అంటూ ఒక్కోసారి వారం పాటు స్నానం చేయడు. అలాగే రాత్రిపూట భార్యతో సంసారం అంటూ ఒత్తిడి పెట్టేవాడు. వీటన్నిటినీ భరించలేని యువతి తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. షేవింగ్ చేసుకోకుండా, స్నానం చేయకుండా ఇతడితో సంసారం చేయడం తనవల్ల కాదని విడాకుల పత్రంలో పేర్కొంది. ఐతే భార్యాభర్తల వాదోపవాదాలు విన్న కోర్టు వారికి కౌన్సిలింగ్ ఇచ్చింది. భర్తకు కూడా శుభ్రత గురించి విడమరిచి చెప్పింది. పరిస్థితి ఇలాగే వుంటే ఆరు నెలల తర్వాత తిరిగి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి పంపేసింది. మరి అతడిలో మార్పు వస్తుందో లేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments