Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిసార్టులో ఎంజాయ్ చేయడానికి వచ్చి శవాలై తేలిన టెక్కీ కుటుంబం

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:28 IST)
మధ్యప్రదేశ్ నగరం ఇండోర్, ఖుడైల్ లోని క్రెసెంట్ వాటర్ పార్క్‌లోని అపోలో డిబి సిటీలో నివశిస్తున్న ఒక ఇంజనీర్, అతని భార్యతో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురూ విషపూరిత వస్తువులను తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాధమికంగా వెల్లడైంది. క్రెసెంట్ వాటర్ పార్కులో ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ అతిథులు కూడా అద్దెకు గదులు తీసుకుంటారు. 
 
డిబి సిటీలో నివసిస్తున్న అభిషేక్ సక్సేనా (45) ఒక రోజు ముందు గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం కుటుంబ సభ్యులు గది నుండి బయటకు రాకపోవడంతో, రిసార్ట్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు కొట్టారు. కానీ ఎంతకీ తలుపులు తీయకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచినప్పుడు గది లోపల నలుగురు విగతజీవులుగా కనబడ్డారు.
 
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతులను అభిషేక్ సక్సేనా(45), అతని భార్య ప్రీతి సక్సేనా (42), కుమారుడు అద్వైత్ (14), కుమార్తె అనన్య(14) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఒక విషపూరిత రసాయనం సమీపంలో కనబడింది. వారంతా ఈ రసాయనాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments