Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు సురేష్ గోపి మరో మైలురాయి - మోడీ కేబినెట్‌లో చోటు!!

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (19:31 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో కేరళ సినీ నటుడు సురేశ్ గోపికి చోటు కల్పించారు. త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన సురేశ్ గోపీ సంచలన విజయం సాధించారు. ఈయన 75 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోడీ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థికి కేంద్ర మంత్రి పదవి... ఇది మోడీ హామీ అంటూ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆయనకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 
 
సురేశ్ గోపి దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ నెలలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ పోయారు. ఈ క్రమంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments