Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు సురేష్ గోపి మరో మైలురాయి - మోడీ కేబినెట్‌లో చోటు!!

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (19:31 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో కేరళ సినీ నటుడు సురేశ్ గోపికి చోటు కల్పించారు. త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన సురేశ్ గోపీ సంచలన విజయం సాధించారు. ఈయన 75 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోడీ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థికి కేంద్ర మంత్రి పదవి... ఇది మోడీ హామీ అంటూ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆయనకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 
 
సురేశ్ గోపి దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ నెలలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ పోయారు. ఈ క్రమంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments