Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చిట్కాతో ప్రాణం తీసుకున్న వ్యక్తి.. కరోనాకు విరుగుడని కిరోసిన్ తాగి...

Webdunia
మంగళవారం, 18 మే 2021 (08:44 IST)
కరోనా కష్టకాలంలో చాలా మంది సొంతింటి వైద్య చిట్కాలను పాటిస్తున్నారు. అలా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కూడా ఓ వ్యక్తి కరోనాకు సరైన విరుగుడు కిరోసిన్ అని గుడ్డిగా నమ్మి కడుపునిండా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 
 
వ్యక్తికి కొద్దిగా జ్వరం ఉండడంతో కొవిడ్‌ అని అనుమానించి కిరోసిన్‌ తాగేశాడు. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ఈ ఘటన భోపాల్‌లోని శివ్‌నగర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహేంద్ర(30) అనే వ్యక్తి శివ్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు వేసుకున్నా లాభం లేకపోయింది. దీంతో అది కొవిడే అన్న అనుమానం బలపడింది. 
 
అంతకు ముందు ఎవరో వ్యక్తి చెప్పడం గుర్తొచ్చి.. కరోనాకు విరుగుడు కిరోసినేనని భావించి సేవించాడు. గత బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తీరా అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే నెగెటివ్‌గా తేలడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments