వరుసకు చిన్నాన్న.. అమ్మాయిపై అత్యాచారం.. మాత్రలిచ్చి గర్భస్రావం..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:31 IST)
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడైన బాబాయ్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని విరుదాచలంలో 15ఏళ్ల బాలికపై చోటుచేసుకుంది. కుమార్తె వరసయ్యే బాలికపై బాబాయ్ అనేక మార్లు దురాగతానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. విరుదాచలంకు చెందిన వల్లియం గ్రామానికి చెందిన వ్యక్తి చిన్నదురై. ఇతని పక్కింటిలో పదో తరగతి చదివే 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఆ బాలికకు చిన్నదురై చిన్నాన్న అవుతాడు. తనకు కూతురు వరసయ్యే ఆ బాలికపై చిన్నదురై కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకుని.. చిన్నదురై 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే బాలికకే అవమానమని బెదిరించాడు. ఇలా అనేకమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం ధరించిన బాలికకు గర్భస్రావం అయ్యేలా మాత్రలిచ్చాడు కామాంధుడు.
 
గత ఏడాది పాటు ఈ అకృత్యం జరుగుతోంది. ఈ వ్యవహారం ఎలాగో బాలిక తల్లిదండ్రులకు తెలియరావడంతో.. వారు పోలీసులకు చిన్నదురైపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నదురైని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments