Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో యోగి వచ్చినా తగ్గని నేరాలు.. 2 నెలల్లో 803 అత్యాచారాలు

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు

Webdunia
గురువారం, 20 జులై 2017 (11:17 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. గడిచిన రెండునెలల కాలంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 
 
యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు శైలేంద్ర యాదవ్ లలాయి అడిగిన ప్రశ్నకు సురేష్ కుమార్ ఖన్నా సమాధానమిస్తూ, మార్చి 15 నుంచి మే 9 వతేదీ వరకు యూపీలో 799 దొంగతనాలు, 60 దోపిడీలు, 2,682 కిడ్నాప్‌లు జరిగాయన్నారు. అత్యాచార ఘటనల్లో 50శాతం కేసులపై చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. యూపీలో యోగి పాలనలో నేరాల సంఖ్య పెరిగిందంటూ.. అందుకు నిరసనగా తామ వాకౌట్ చేస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments