Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 2.7లక్షల కరోనా కేసులు.. 217 మంది మృతి.. 8,909 కొత్త కేసులు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (10:50 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8,909 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2.7 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 5,815 మంది కరోనాతో చనిపోయారు. 1,00,303 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఇకపోతే.. మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891 కేసులు నమోదైనాయి.
 
అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 30,66,696 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments