Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?

రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవ

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (13:40 IST)
రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవాంశ సంభూతడని చెప్పుకునేవాడు. అలాగే తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని పలుమార్లు చెప్పుకునేవాడు. 
 
ఈ నేపథ్యంలో తనపై అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్లు సమాచారం. మిగిలిన అమ్మాయిల సంగతి ఏమైందని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ను వెతుకుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. 
 
దాతీ మహారాజ్ తనను దశాబ్ధం పాటు ఆశ్రమంలో బందీ వుంచాడని.. ఆయన, ఆయన అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments