Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?

రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవ

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (13:40 IST)
రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవాంశ సంభూతడని చెప్పుకునేవాడు. అలాగే తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని పలుమార్లు చెప్పుకునేవాడు. 
 
ఈ నేపథ్యంలో తనపై అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్లు సమాచారం. మిగిలిన అమ్మాయిల సంగతి ఏమైందని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ను వెతుకుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. 
 
దాతీ మహారాజ్ తనను దశాబ్ధం పాటు ఆశ్రమంలో బందీ వుంచాడని.. ఆయన, ఆయన అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments