Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కుర్లాలో బస్సు బీభత్సం - ఆరుగురు మృతి - 49 మందికి గాయాలు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:15 IST)
ముంబై మహానగరంలోని కుర్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగని ఆ బస్సు అపార్టుమెంట్ గేట్లను ఢీకొట్టి సెల్లార్‌లోకి దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి బయలుదేరింది. ఈ బస్సు వేగంగా వెళుతు అదుపుతప్పడంతో ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లతో పాటు రోడ్డుపై నడిచివెళుతున్న పాదాచారులను కూడా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments