Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలోని కర్నాల్‌లో పాఠశాలలో 54 మందికి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (18:06 IST)
హర్యానాలోని కర్నాల్‌లో గల ఓ పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. గడిచిన డిసెంబర్‌ నెలలో 9 నుంచి 12వ తరగతి వరకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అదేవిధంగా ఫిబ్రవరి 24 నుంచి 3 నుంచి 5 తరగతులకు అనుమతి తెలిపింది. 
 
సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కాంటాక్ట్‌-ట్రేసింగ్‌-టెస్టింగ్‌ పద్ధతిలో స్కూల్‌ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 54 మంది విద్యార్థులకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. స్కూల్‌ హాస్టల్‌ భవనాన్ని సీజ్‌ చేసి కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
ఫిబ్రవరి 22న ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ స్కూల్‌ను మూడు భాగాలుగా విభజించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఓ వింగ్‌లోని విద్యార్థి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే ఆ విభాగాన్ని 10 రోజులపాటు మూసివేస్తారు. 
 
ఆపై మొత్తం స్కూల్‌ను శానిటైజ్‌ చేస్తారు. ఒకవేళ ఒక వింగ్‌ కంటే ఎక్కువగా విద్యార్థులు కొవిడ్‌ భారిన పడ్డట్లు తెలితే మొత్తం స్కూల్‌నే 10 రోజుల పాటు బంద్‌ చేయనున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగనున్నట్లు, పాఠశాలకు వెళ్లడం వారి ఐశ్చికమేనని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments