Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి మృతి.. 15 కి.మీ నడిచి..?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (14:53 IST)
తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాయ్‌పుర్‌ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్‌ (60) తన మనవరాలు అంజలితో బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉండటం, మార్గమధ్యంలో తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి ఇద్దరూ కుప్పకూలిపోయారు. కాసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
 
అంజలి, సుకి దేవిలు.. సిరోహి జిల్లా నుంచి జలోర్ జిల్లాలోని గ్రామానికి పయనం అయ్యారు. ఇందుకోసం దగ్గరి దారి ఎంచుకున్నారు. వాస్తవానికి రోడ్డు మీదుగా వెళితే 22 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంత దూరం నడవలేక.. అడ్డదారిని ఎంచుకున్నారు. అది 15 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ దారి ఎడారి గుండా వెళ్తుంది. అయినా వాళ్లు లెక్క చేయలేదు. ఆ దారిలోనే వెళ్లారు. అయితే కొంతదూరం వెళ్లగానే వారు అలసిపోయారు. ఎండ ఎక్కువగా ఉండటంతో దాహంతో అలమటించారు. తాగడానికి నీరు లేక సొమ్మసిల్లి పడిపోయారు.
 
కొంత దూరం నడిచాక చిన్నారికి బాగా దాహం వేసింది. తాగేందుకు నీరు కావాలని పదే పదే అవ్వని అడిగింది. కానీ ఆమె దగ్గర నీరు లేవు. కనుచూపు మేరలో ఎక్కడా తాగునీరు కనిపించ లేదు. అదే సమయంలో దారిలో ఓ గొర్రెల కాపరి కనిపించాడు. తాగడానికి నీరు ఇవ్వాలని వారు అడిగారు. అందుకు అతడు నిరాకరించాడు. ఆ కాసేపటికే చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత అవ్వ పడిపోయింది. అదే దారిలో వెళ్తున్న మరో గొర్రెల కాపరి వారిని గమనించాడు. వెంటనే స్థానిక సర్పంచ్ కి సమాచారం ఇచ్చాడు. సర్చంచ్ పోలీసులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సుకి దేవికి తాగునీరు అందించారు.
 
ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా పాప చనిపోయిందన్నారు. సుకి దేవికి చికిత్స అందిస్తున్నారు. కాగా వారిద్దరూ 5 గంటల పాటు 7 కిలోమీటర్లు మండుటెండలో నడిచారు. వారు ఊరికి వెళ్లేందుకు తప్పు దారి ఎంచుకున్నారు. పైగా, వెంట తాగునీరు కూడా తీసుకెళ్లలేదు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments