ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం :: వంతెనపై నుంచి పడిన బస్సు - ఐదుగురు దుర్మరణం

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (08:43 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వంతెనపై నుంచి ఓ బస్సు ప్రమాదవశాత్తు కిందపడింది. ఈ ఘటనపై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు వంతెనపై నుంచి పడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, మొత్తం 47మంది ప్రయాణికులతో పూరీ నుంచి బంగాల్​కు సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో జాజ్‌పుర్​​లోని 16వ జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఫ్లైఓవర్​ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన వారి వెంటనే కటక్​లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రవాణా కమిషనర్ అమితవ్ ఠాకూర్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 16 అంబులెన్స్​ల సాయంతో కటక్​ ఆస్పత్రికి తరలించాం. గ్యాస్​ కట్టర్లను ఉపయోగించి బస్సు కిటికీలు కత్తిరించి ప్రయాణికులను రక్షించాం. అనంతరం బస్సును క్రేన్​ సహాయంతో పైకి తీశాం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బంగాల్​కు చెందినవారే ఉన్నారు' అని అమితవ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments