Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరినొకరు కాపాడేయత్నం... నీట మునిగి ఐదుగురు టీనేజర్లు మృతి

Webdunia
ఆదివారం, 14 మే 2023 (13:17 IST)
గుజరాత్ రాష్ట్రంలోని బోతాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నీట మునిగిన తమ స్నేహితుడిని రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు టీనేజర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడిన ఇద్దరు టీనేజర్లను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తూ ఈ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో మునిగేందుకు ఐదుగురు టీనేజర్లు వెళ్లారు. వారిలో ఇద్దరు తొలుత నీటిలో దిగి మునిగిపోతుండటంతో మరో ముగ్గురు వారిని రక్షించేందుకు నీటిలో దిగారు. వీరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 16 నుంచి 17 యేళ్ల వారేనని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ కిషోర్ బలోలియా మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ వారు కూడా మరణించారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments