Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం.. 47మంది మృతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచా

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (14:07 IST)
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 30 మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు.
 
ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. 45మంది ప్రయాణికులతో రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
 
మృతుల్లో 28 మంది రామ్‌నగర్‌కు చెందిన వారని గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మృతులకు రూ.2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల అందివ్వనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments