Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం దాడిలో 35 మంది ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (06:16 IST)
ఉగ్రవాదంపై భారత సైన్యం మరో విజయం నమోదు చేసుకుంది. భారత దేశంలోకి ప్రవేశించేందుకు పొంచి ఉన్న ఉగ్రవాదులను భీకర దాడులతో మట్టుబెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది.
 
రక్షణ శాఖ వర్గాలు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌తో నిర్వహించిన దాడుల్లో దాదాపు 35 మంది జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అంతమయ్యారు. జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టర్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.

పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఎటువంటి హెచ్చరికలు లేకుండా సాధారణ ప్రజలపైనా, సైనిక స్థావరాలపైనా కాల్పులు జరపడంతో, భారత సైన్యం ప్రతీకార దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ దళాలు శని, ఆదివారం మధ్య రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించగా, ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు గాయపడ్డారు.
 
దీంతో భారత సైన్యం ప్రతిస్పందించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఏడు ఉగ్రవాదుల స్థావరాలపై ఆర్టిలరీ దాడులు చేసిందని, 35 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని పేర్కొన్నాయి. ఇరు సైన్యాల మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపాయి.

ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నట్లు, శత్రువులు గాయపడినట్లు తెలిపాయి. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను అక్రమంగా పంపించేందుకు పాకిస్థాన్ సైన్యం ప్రయత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments