Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలెను... తల్లిదండ్రుల ప్రకటన!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (09:34 IST)
ఎపుడో మూడు దశాబ్దాల క్రితం మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలంటూ కర్నాటకకు చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన ఆసక్తికరంగా మారింది. కర్నాటక రాష్ట్రంలోని పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ జంట ఈ తరహా ప్రకటన ఇచ్చింది. ఇందులో కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 యేళ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్టయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి అంటూ అందులో పేర్కొన్నారు. 
 
పైగా, ఇందుకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబరును కూడా వారు ఆ ప్రకటనలో పొందుపరిచారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ, ఉడిపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెళ్లి చేసినట్టుగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments