Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుందామనుకుని చెరువులో దిగారు.. ఆ ముగ్గురు ఏమైయ్యారు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:47 IST)
సెల్ఫీ తీసుకుందామని వచ్చాడు.. చివరికి ఆ సెల్ఫీయే అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు అతనితో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఒకే కళాశాలలో చదువుతున్నారు. జాతీయ సేవ పథకం వాలంటీర్లుగా సేవలందించేవారు.
 
పూర్ణచంద్ర, ముహ్మద్ ముర్తుజా, శశాంక్ అనే ఈ ముగ్గురూ జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గొనేందుకు నేలమంగళ తాలూకా దొబ్బేస్ పేటకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ శిబిరం చివరిరోజు సందర్భంగా హలెంజిగల్ చెరువు వద్ద సెల్ఫీలు దిగాలనుకున్నారు. అయితే ముందుగా పూర్ణచంద్ర మెుదట సెల్ఫీ తీసుకుంటానని ఆ చెరువులో దిగాడు.
 
అప్పుడు అతను సెల్ఫీ తీస్తూ చెరువులో మునిగిపోయాడు. అతనిని రక్షించేందుకు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా నీటిలో దిగారు. కానీ చివరికి ముగ్గురు స్నేహితులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు ఆ చెరువు వద్ద గల దేవాలయాన్ని శుభ్రం చేసేందుకు కళాశాల ద్వారా ఇక్కడి వచ్చారు. కానీ, ఈ సెల్ఫీ క్రేజులో పడి నీళ్లలో మునిగిపోయారని ఎస్పీ మల్లికార్జున చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments