Webdunia - Bharat's app for daily news and videos

Install App

21న 2జీ కేసు తుది తీర్పు.. రాజా - కనిమొళిలు దోషులా?

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:46 IST)
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని పాటియాలా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ప్రకటించారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామన్నారు. గతంలో అనేక సార్లు ఈ కేసు వాయిదా పడింది. నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5వ తేదీన వెల్లడిస్తామని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ తుది తీర్పును ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments