Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లో తొక్కిసలాట.. 27మంది మృతి.. మహిళలే ఎక్కువ

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (17:19 IST)
Stampede
ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మరణించారు. అలాగే 15 మంది మహిళలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది భక్తులు మృతి చెందగా, వారిలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులతోపాటు ఒక పురుషుడు ఉన్నారు. 
 
అలాగే క్షతగాత్రులను ఎటాహ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సంఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
 
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఏర్పాటైన ప్యానెల్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా), అలీగఢ్ కమీషనర్ నేతృత్వం వహిస్తారు.

హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments