Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. 25 మంది స్కూలు విద్యార్థుల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (14:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ చిన్నారులంతా ఎటాలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది అత్యంత బాధాకర విషయమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...  ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందని తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగా పాఠ‌శాల‌లు మూసేయాల‌ని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టికి స‌ద‌రు స్కూలు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments