Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 1 నుండి 200 ప్యాసింజర్‌ రైళ్లు

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:17 IST)
వలసకార్మికులను తరలించే శ్రామిక్‌ రైళ్లతో పాటు జూన్‌ 1 నుండి ప్యాసింజర్‌ రైళ్లను కూడా నడపనుంది. వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న 15 రైళ్లతో పాటు  200 అదనపు రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ బోగీలను కూడా అనుమతించినట్లు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నెల 12 నుండి అనుమతించిన 15 ప్రత్యేక రైళ్లు ఎసిబోగీలతో మాత్రమే ప్రయాణించిన సంగతి తెలిసిందే.

అలాగే ప్రయాణికులు మాస్కులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం, భౌతిక దూరం వంటి ఆదేశాలను విధిగా పాటించాల్సిందేనని సూచించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్రం ఆదేశించినప్పటికీ, బస్సు సర్వీసులు, ఇతర ప్రజా రవాణాపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 12 వేల రైళ్లు ప్రయాణించేవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments