Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఘోర విషాదం, కల్తీ మద్యం సేవించి 20 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (17:03 IST)
కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా కొందరు మందు బాబులు మాత్రం తెగబడి వాటిని సేవిస్తుంటారు. అది చివరికి ప్రాణాలకు ముప్పుగా మారుతుంటుంది. ఈ క్రమంలో హర్యానాలో ఓ విషాదం చోటుచేసుకున్నది. కల్తీ మద్యం సేవించడంతో దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
 
హరియానా సోనిపట్‌లో ఈ విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 20 మంది మృత్యువాత పడిన ఘటనపై సోనిపట్ ఏఎస్పీ వీరేంద్రసింగ్ స్పందించారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది కానీ ఇప్పటివరకు ఎవరిపైనా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 
 
నలుగురు మృతదేహాల శాంపిల్స్ తీసి టెస్టులకు పంపించాం. ఈ కేసులో దోషులు లేదా ఇందుకు బాధ్యులు ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ఇలాంటి ఘటన జరిగితే తమకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments