సరదాగా వాటర్ ట్యాంక్ ఎక్కిన చిన్నారులు... కూలిపోవడంతో ఇద్దరు మృతి

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (11:31 IST)
సరదాగా ఎక్కి వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో 12 యేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలోని సుఖదాంబ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన ముగ్గురూ విద్యార్థులే. వారి స్కూలు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన వెంటనే దాని స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
జల్ జీవన్‌ మిషన్‌లో భాగంగా, ఈ వాటర్ ట్యాంకును నిర్మించుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ఇది ప్రమాదం కాదని, ఇది నేరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకును ఎంత నాణ్యతతో నిర్మించారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని, కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ 
 
గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉందని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు. గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులకి గోశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు. గోవుల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని, పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్వం గోవులను సంరక్షించడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. 
 
గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కటారియా.. గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తుందని, ప్రతి ఇంట్లో వాటిని రక్షించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవులను రక్షించకపోతే దేశంలో వ్యవసాయం నాశనమవుతుందని ఆయన అన్నారు. పాఠ్యాంశాల్లో గోవుల గురించి చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అవినీతిని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించడంపై దైవ సంకల్పమని కటారియా అభివర్ణించారు. గతంలో పేదలకు చేరాల్సిన నిధులు అవినీతి కారణంగా చేరలేదని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments