Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి... భవనంపై నుంచి కిందికి తోసేశారు...

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:31 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను భవనం నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం, పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 యేళ్ళ యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు బాధితురాలిని భవనం నుంచి కిందికి తీసేశారు.
 
దాంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల మ‌ధ్య‌గా ఉన్న రోడ్డుపై ఆ యువ‌తి ప‌డిపోయింది. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ప‌డివున్న యువ‌తిని చూసి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఉద‌యం ఆప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఆస్ప‌త్రి చేర్చామ‌ని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని పోలీసులు చెప్పారు. 
 
అయితే నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని బాధితురాలి చెప్ప‌లేక‌పోతున్న‌దని, తాము ప్ర‌స్తుతం నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని తెలిపారు. నిందితుడు ప‌ట్టుబ‌డితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments