Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 17 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (11:33 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి 17 మంది మృత్యువాతపడ్డారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కురిసిన భారీ వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, నహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పిడుగులు పడేసమయంలో విపత్తుల శాఖ జారీ చేసిన సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య తీర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments