Webdunia - Bharat's app for daily news and videos

Install App

చత్తీస్‌గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం... సర్కారుకు నోటీసులు

యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (10:19 IST)
యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారని, వారిని దారుణంగా హింసించారని, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. అత్యాచారానికి గురైన 8 మందికి రూ. 3 లక్షలు, లైంగిక వేధింపులకు గురైన ఆరుగురికి రూ. 2 లక్షలు, భౌతిక దాడికి గురై బాధపడ్డ ఇద్దరికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సూచించింది. 
 
అయితే, ఈ ఘటనలు 2015, 2016లో నమోదయ్యాయని, పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తాము 20 మంది బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు పేర్కొంది. కాగా, నవంబర్ 2015లో దాదాపు 40 మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం