Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 16 మంది మృతి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:51 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ పిడుగులపాటుకు ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే  పిడుగుపాటుతో 16 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివవరకు కురిసిన పిడుగుల వర్షానికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం ఈస్ట్ చంపారాన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారాన్ జిల్లాలో ఇద్దరు, అరారియ జిల్లాలో ఇద్దరు బంకా ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, ఈ పిడుగల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments