Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వచ్చిన 16 మంది ఆఫ్ఘన్ నిర్వాసితులకు కరోనా

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (10:39 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మంది నిర్వాసితులకు కరోనా వైరస్ సోకింది. రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న 78 మందిని ఎయిర్ ఇంఢియా విమానం(ఏఐ1956)లో కాబుల్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి వారికి కరోనా పరీక్షలు చేశారు. ఢిల్లీకి చేరిన 78 మందిలో 16 మందికి కరోనా సోకింది. కరోనా వచ్చిన వారు కేంద్రమంత్రి హర్దీప్ పూరిని కలిశారు. 
 
దీంతో కాబూల్ నుంచి వచ్చిన 78 మందిని క్వారంటైన్ చేశారు. కరోనా వచ్చిన వారిలో అసింప్టమాటిక్ అని వైద్యులు చెప్పారు. కాబూల్ నుంచి వచ్చిన వారిలో 25 మంది భారతీయులు మిగిలిన వారు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. 
 
కాబుల్‌లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్‌కు చెందిన మూడు ప్రతులను ఢిల్లీకి తీసుకు వచ్చి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురికి అప్పగించారు. గతంలో అప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు సిక్కులున్నారు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి కరోనా సోకిన సిక్కులకు స్వాగతం పలికడం కలకలం రేపింది. కాబూల్ నుంచి వచ్చిన 78 మందిని ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల పాటు చావ్లాలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంప్‌లో క్వారంటైన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments