Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారాకు 16 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (16:01 IST)
పగలంతా తేయాకు తోటల్లో పనిచేసిన కూలీలు రాత్రి వేడుక చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే మద్యం దుకాణం నుండి మద్యం తెప్పించారు. అది 17 మంది ప్రాణాలను బలిగొంది. దానిని సేవించిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌లో జరిగింది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. వారికి స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్‌ అనే వ్యక్తి మద్యం సరఫరా చేశాడు. మద్యం సేవిస్తుండగా కొద్ది సేపటికి నలుగురు మహిళలు కిందపడిపోయారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. విషపూరిత మద్యం తాగినందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది మృత్యువాతపడ్డారు. కొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. దాదాపుగా 30 మందికి పైగా ఆ వేడుకలో విషపూరిత మద్యం సేవించారని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉందని, మరింత మంది చనిపోయే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రసాయనాల క్యాన్‌లలో మద్యాన్ని తీసుకురావడం వల్లే అది కలుషితమైందని భావిస్తున్నారు. అది కల్తీ మద్యం అయి ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments