ఆ బాలికపై అత్యాచారం జరగలేదు.. విషం తాగి చనిపోయింది.. ప్రేమే కారణమా?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:38 IST)
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి కూతురిని తండ్రే అత్యాచారానికి పాల్పడి చంపేశాడని ఆరోపణలు వచ్చాయి.

కానీ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమెపై రేప్ జరగలేదని నివేదికలో వెల్లడి అయ్యింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని వైద్యులు చెప్పారు. శరీరంలో విషం లభించిందని.. విషం సేవించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర దినజ్‌పూర్‌ జిల్లాలోని సోనార్‌పూర్ ప్రాంతంలో ఆదివారం 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే శవమై కనిపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతదేహం ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద లభ్యమైంది. ఘటనా స్థలంలో విషం బాటిల్‌తో పాటు మొబైల్ ఫోన్ దొరికింది.
 
ఆ మొబైల్ ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ఆ యువకుడికి మృతురాలికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బాలిక చనిపోయిన మర్నాడే అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం సోనార్‌పూర్‌లోని చెరువు వద్ద ఫిరోజ్ అనే అతడి మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం