Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిపై అత్యాచారం.. ప్రిన్సిపాల్ అరెస్టు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (13:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రిన్సిపాల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డాడు. దినేష్ కుమార్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడని పోలీసులు చెపుతున్నారు. విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
ముజఫర్ నగర సమీపంలో షమిలిలో దినేష్ కుమార్ అనే వ్యక్తి సొంతంగా ప్రైవేటు స్కూల్‌ను నడుపుతున్నాడు. ఇదే స్కూల్‌లో 15 సంవత్సరాల బాలిక ఆరో తరగతి చదువుతోంది. దినేష్ కుమార్ కన్ను బాలికపై పడటంతో అదును కోసం వేచి చూశాడు. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ బాలికను స్కూల్ అయిపోయిన తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. 
 
హోం వర్క్ పేరుతో బాలికను స్కూల్‌లోనే పెట్టుకుని అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలిక శరీరంలో మార్పులు గుర్తించిన కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో ముజఫర్ నగర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ దినేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments