Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూర్ శివారులో రేవ్ పార్టీ.. సీఎం సిద్ధరామయ్య సీరియస్...

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:25 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ శివారు ప్రాంతంలో కొందరు యువతీయువకులు రేవ్ పార్టీని జరుపుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో 15 మంది యువతులు అపస్మారకస్థితిలో ఉన్నారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఫాం హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రేవ్ పార్టీలో వాడిన మందులు, డ్రగ్స్‌ శాంపిల్స్‌నుసేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. పోలీసులు అదుపులో ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారకస్థితిలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
 
కాగా, ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి రక్తం శాంపిల్స్ కూడా సేకరించామని, రిపోర్టుల కోసం వేచిచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ రేవ్ పార్టీకి సంబంధించిన నిర్వాహకులతో పాటు ఇందులో పాల్గొన్నవారిలో దాదాపు 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments