Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (13:28 IST)
kidanappers
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు 14 ఏళ్ల మైనర్ బాలికను బొలెరో కారులో ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమె పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రాజస్థాన్‌లోని డీగ్ గ్రామమైన భరత్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ముందు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 
 
సంఘటనా స్థలంలో ఉన్న ఇతర బాలికలు నిరసన వ్యక్తం చేయడంతో, దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి బాలికను కిడ్నాప్‌ చేశారు. ఆరుగురు పురుషులపై అపహరణ, కాల్పుల కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. వరకట్నం వేధింపుల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చిందని.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ కిడ్నాప్ వెనుక ఆమె అత్తమామలు ఉన్నారని ఆమె పట్టుబట్టారు.
 
ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తుపాకీతో బెదిరించి ఆమెను అపహరించారు. స్థానికులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కమాన్ సర్కిల్ అధికారి గిర్రాజ్ మీనా అన్నారు.
 
డీగ్ జిల్లాలోని పహారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ కిడ్నాప్ తతంగం రికార్డ్ అయ్యింది. కిడ్నాపర్లను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments