Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (13:28 IST)
kidanappers
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు 14 ఏళ్ల మైనర్ బాలికను బొలెరో కారులో ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమె పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రాజస్థాన్‌లోని డీగ్ గ్రామమైన భరత్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ముందు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 
 
సంఘటనా స్థలంలో ఉన్న ఇతర బాలికలు నిరసన వ్యక్తం చేయడంతో, దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి బాలికను కిడ్నాప్‌ చేశారు. ఆరుగురు పురుషులపై అపహరణ, కాల్పుల కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. వరకట్నం వేధింపుల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చిందని.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ కిడ్నాప్ వెనుక ఆమె అత్తమామలు ఉన్నారని ఆమె పట్టుబట్టారు.
 
ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తుపాకీతో బెదిరించి ఆమెను అపహరించారు. స్థానికులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కమాన్ సర్కిల్ అధికారి గిర్రాజ్ మీనా అన్నారు.
 
డీగ్ జిల్లాలోని పహారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ కిడ్నాప్ తతంగం రికార్డ్ అయ్యింది. కిడ్నాపర్లను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments