Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. 14 రోజుల చిన్నారి బలి

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:57 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కావడంతో ఏ లక్షణాలు లేకున్నా వైరస్ అటాక్ అవుతోంది. తాజాగా గుజరాత్‌లో ఓ పసికందు మరణం విషాదం నిపింది. రోజుల పసిగుడ్డు కూడా కరోనా కాటుకు బలైపోయింది.
 
గుజరాత్ సూరత్‌కి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. దీంతో పుట్టిన బిడ్డకు కూడా రక్కసి కాటేసింది. బాలింతను మరో దవాఖానకు తరలించారు.

బిడ్డను ఇంటెన్సివ్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో రెమ్ డెసివర్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందజేశారు.
 
చిన్నారికి మాజీ మేయర్ సూరత్ జగదీశ్ పటేల్ ప్లాస్మా కూడా దానం చేశారు. సూరత్ ఇటీవల కరోనా సోకి.. కోలుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్మా దానం చేసినా ఫలితం లేకపోయింది.

ఆ చిన్నారి కరోనాతో గెలవలేక తనువు చాలించింది. ఇటు గుజరాత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గురువారం సూరత్‌లో 1551 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మంది వైరస్‌తో చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments